| Home >> Tirupati News >> తిరుపతి - తుంగభద్రమ్మ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు |
Posted on 07 Dec ,2010
తుంగభద్రమ్మ పుష్కరాలకు వెళ్లే యాత్రీకుల సౌకర్యార్థం తిరుపతి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఇందులో భాగంగా... ఈ నెల 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే తుంగమ్మ పుష్కరాలకు తిరుపతి పరిధిలోని చిత్తూరు, మదనపల్లె, తిరుపతి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తిరుపతి ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.దీంతో పాటు 35 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలనుకునే ప్రయాణీకులు, యాత్రికుల కోసం తిరుపతి రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులను ఆర్టీసీ నడుపనుంది.
ఈ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు చిత్తూరు, మదనపల్లె, తిరుపతిలలో ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు మంత్రాలయం కర్నూలుకు చేరుకుంటాయి